శపథం చేసిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేశారంటూ నిప్పులు చెరిగారు. దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ డాక్టర్ మహ్మద్ సాదిక్, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గరికపాటి వెంకట్.. జనసేనలో చేరారు. కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.

ఈ సందర్భంగా పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 సీట్లను గెలుస్తామంటూ వైఎస్ఆర్సీపీ అతిగా విశ్వసిస్తోందని ఎద్దేవా చేశారు. ఒక్క సీటులో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవకుండా చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ- జనసేనకు ఆ సత్తా ఉందని చెప్పారు.

ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కనీసం దశాబ్దం కాలం పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని, అప్పుడే విభజన మిగిల్చిన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలమని పవన్ కల్యాణ్ అన్నారు. యువత, వీర మహిళల బలం వల్లే జనసేన పార్టీ నిలబడగలుగుతోందని పవన్ వ్యాఖ్యానించారు.
JanaSena Chief Sri #PawanKalyan Speech
— JanaSena Party (@JanaSenaParty) December 14, 2023
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నం నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్ డా. మహ్మద్ సాధిక్, ప్రకాశం దర్శి నుంచి శ్రీ గరికపాటి వెంకట్ లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. pic.twitter.com/4XjcxW2Hrz
వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, ఏపీని గాడిలో పెట్టాల్సిన బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ అన్నారు. ముస్లింలు మైనారిటీలు కాదని, వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారాయన. మైనారిటీలను ఓటుబ్యాంకుగా చూసే మనిషిని కానని వ్యాఖ్యానించారు.

ఒక్కసారి జనసేనను నమ్మాలని, మాటిస్తే వెనక్కి వెళ్లబోనని పవన్ అన్నారు. వైసీపీలాంటి గూండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నాం అంటే దానికి కారణం.. యువతేనని అన్నారు. అన్ని మతాలపైన తనకు అపారమైన గౌరవం ఉందని, బీజేపీతో కలిసి ఉండటం వల్లే మైనారిటీలు జనసేనకు దూరంగా ఉన్నారని చెబుతున్నారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications