ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..టీడీపీ కీలక నేత అరెస్ట్
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1) అరెస్ట్ సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడైన జనార్ధన్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న జనార్ధన్రావు.. ఈరోజు సౌతాఫ్రికా నుంచి నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే రంగంలోకి దిగి, అతడిని అరెస్ట్ చేశారు.

నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న జనార్ధన్రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో, ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను, ఇతర నిందితులను గుర్తించేందుకు జనార్ధన్రావును పోలీసులు ప్రశ్నించనున్నారు.
నకిలీ మద్యం సరఫరా, అమ్మకాల కేసుల్లో ప్రధాన నిందితుడిని విదేశాల నుంచి రాగానే అరెస్ట్ చేయడం ఈ కేసు దర్యాప్తులో ముఖ్య పరిణామంగా చెప్పవచ్చు. ఈ కేసులో జనార్ధన్రావు పేరు బయటకు రాగానే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ నకిలీ మద్యం కేసులో ఎవరి పాత్ర ఉన్న విడిచిపెట్టేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications