జనసేన టెంపరరీ పార్టీ, పవన్కళ్యాణ్ కాలం చెల్లిన రాజకీయ నాయకుడు: మంత్రి ఆది
అమరావతి: జనసేన పార్టీపైనా, ఆ పార్టీ అధినేత పవన్కళ్యాణ్పైనా మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జనసేన ఓ టెంపరరీ పార్టీ అని, పవన్కళ్యాణ్ ఓ కాలం చెల్లిన రాజకీయ నాయకుడని ఆయన వ్యాఖ్యానించారు.
బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ గంటకో రకంగా మాట్లాడుతున్న జనసేన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
''బీజేపీది మేకపోతు గాంభీర్యం..''
దేశంలో అత్యంత బలహీనమైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని మరో మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. దేశ పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు 13సార్లు విశ్వాస తీర్మానం, 26సార్లు అవిశ్వాస తీర్మానాలపై చర్చలు జరిగితే ఇప్పుడు బీజేపీ అవిశ్వాసంపై చర్చ అంటేనే భయపడి పారిపోతోందన్నారు.
''టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులను అడ్డం పెట్టుకొని..''
పార్లమెంటులో టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులను అడ్డం పెట్టుకొని అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ అడ్డుకుంటోందని మంత్రి జవహర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అహంకారం పెరిగిపోయిందని, రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు.