Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్‌కు షాక్..జనసేనకు మరో నేత గుడ్ బై..!

సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. జనసేనకు చెందిన కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ జనసేనకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ మనుక్రాంత్ గతంలోనే జనసేనకు రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆయన పవన్ కల్యాణ్ వ్యవహారశైలి నచ్చకనే జనసేన నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించారు.

తాజాగా ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.మనుక్రాంత్‌తో పాటు, జనసేన నేతలు కాటంరెడ్డి జగదీష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌, టీడీపీ నేత చేజర్ల సుబ్బారావు, కాంగ్రెస్‌ నేతలు పంతం నెహ్రూ, ఇందిర వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు జనసేన నుంచి పెద్ద ఎత్తున నాయకులు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Janasena Nellore Rural Constituency In-charge Manukranth Chennareddy joins ysrcp

ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పరుచూరి భాస్కరరావు,పితాని బాలకృష్ణ , పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజబాబు, మాకినీడి శేషుకుమారి వంటి నాయకులు జనసేనకు రాజీనామా చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+