ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన వీడియో ప్రచారం... వీడీయో
ప్రభుత్వ విధానాలు, అభివృద్దిపై విమర్శలు చేస్తున్న జనసేన తన దాడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతోపాటు, సీఎం జగన్ మొహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాలు, వాటి అమలు తీరుపై సోషల్ మీడియాలో జగన్నాటకం పేరిట ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే జగన్ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే గ్రామ వాలంటీర్లు పేరుతో 90 శాతం ఉద్యోగాలు పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టారని విమర్శించారు. పిల్లలను బడికి పంపిస్తే అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక ఇద్దరు పిల్లలు ఉండాలని చెబుతూ..మాట తప్పారని ధ్వజమెత్తింది. ఇక మత్యకారులకు 45 ఏళ్లకు పింఛన్, వికలాంగులకు రూ.3వేలు ఫించన్ ఇస్తామనే ..

హామీని తుంగలో తొక్కారని పేర్కోంది...మరోవైపు రాష్ట్రం ఇస్తున్న రైతు భరోసా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6వేల రూపాయలతో కలుపుకొని ఇస్తున్నారని.. తెలిపారు...ఇలా అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుగా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని వీడియోలో పేర్కొన్నారు.
'జగన్ నాటకంలో' కొన్ని సన్నివేశాలు!#YSJaganDarkGovernance #YSRCP pic.twitter.com/CGls0YtqqL
— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 17, 2019












Click it and Unblock the Notifications