AP Pensions: డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ ? సచివాలయ ఉద్యోగుల రిక్వెస్ట్..!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతీ నెల ఒకటో తేదీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయిస్తోంది. గతంలో వాలంటీర్లు పంపిణీ చేసిన ఈ పెన్షన్లను కూటమి సర్కార్ వచ్చాక మాత్రం సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. అయితే ప్రతీ నెల ఒకటో తేదీనే ఇస్తున్నా.. ఒక్కో సారి పరిస్ధితుల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈసారి కూడా కొత్త ఏడాది 2026లో జనవరి పెన్షన్లు ఒకరోజు ముందే అందే అవకాశాలున్నాయి.
జనవరి ఒకటో తేదీ కొత్త ఏడాది వేడుకల సందర్భంగా, ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే పింఛన్ల పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మిగిలిన పింఛన్లను మాత్రం జనవరి 2వ తేదీ పంపిణీ చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోరారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు ఈ మేరకు అవకాశం కలుగుతుందని వారు చెప్తున్నారు.

గతేడాది కూడా ఇలాగే కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న పెన్షన్ల పంపీణీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, ఈసారి కూడా ఆ సంప్రదాయన్ని కొనసాగించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్ డబ్ల్యూఎస్ కోరుతోంది. అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఇలా ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ నిబంధనల్లో మార్పులు చేసి వెసులుబాట్లు కల్పించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈసారి కూడా ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
-
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది!












Click it and Unblock the Notifications