వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడుపు ఆగలేదు: ఉదయ్ కిరణ్ మృతిపై జయసుధ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ప్రముఖ నటి, సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ మంగళవారం అన్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు చూసేందుకు ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని ఫిలిం చాంబర్‌కు తరలించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ మృతిని తట్టుకోలేక ఏడ్చానని, ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానని అన్నారు. అతను తీసుకున్నది సరైన నిర్ణయం కాదన్నారు.

కాగా, ప్రముఖ తెలుగు హీరో ఉదయ్ కిరణ్ మరణించడం దురదృష్టకరమని, అతని భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి సోమవారం చెప్పిన విషయం తెలిసిందే. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయ్ మరణాన్ని ఊహించలేకపోయామని, ఈ అఘాయిత్యానికి కారణభూతులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఉదయ్ కిరణ్ మృతి పట్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి మరణాలు ఉండకూడదన్నారు. సినీ జీవితాల్లో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటైందని, ఏది ఏమైనా బతికుండి సాధించుకోవాలని నన్నపనేని హితవు చేశారు.

English summary
Telugu film personolities have expressed their shock over Hero Uday Kiran's death and have offered condolonce to his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X