వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెసి బ్రదర్స్‌కి టిడిపిలోకి నో ఎంట్రీ: పరిటాల సునీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paritala Sunitha
అనంతపురం/ఖమ్మం: అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నేతలు జెసి సోదరులు తమ పార్టీలో చేరేందుకు అంగీకరిమించమని జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసన సభ్యురాలు పరిటాల సునీత బుధవారం అన్నారు. జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డిలు టిడిపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె దీనిపై స్పందించారు. వారికి తమ పార్టీలోకి ఆహ్వానం ఉండదన్నారు. అదే సమయంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జరుగుతున్న దాడులకు వారే బాధ్యత వహించాలని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం జెసి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లేందుకు ఆసక్తి కనబర్చినట్లుగా మాట్లాడారు.

భద్రాచలం తెలంగాణలోనే

భద్రాచలంను తెలంగాణ ప్రాంతంలోనే ఉంచాలంటూ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా భద్రాచలం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావును బుధవారం పరామర్శించిన అనంతరం దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఆందోళనలు సాగుతున్నా పాలకులు స్పందించటం లేదన్నారు.

నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనులను కొల్లగొట్టిన సీమాంధ్రులు, భద్రాచలంలోని సహజ వనరులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తును తగ్గించటం ద్వారా నష్టాన్ని నివారించవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని 157 గ్రామాలను ముంచేందుకే పాలకులు సిద్ధపడటం దారుణమన్నారు.

English summary

 JC Brothers are responsible for attacks on TDP activists, they are not welcome in our party, says Paritala Sunitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X