రెచ్చిపోయిన జేసీ: విశాఖ ఎయిర్ పోర్టులో రచ్చ.. ప్రింటర్ విసిరేసి!..
గురువారం ఉదయం ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా.. బోర్డింగ్ సమయం కంటే ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు వచ్చారు.
విశాఖపట్నం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చిర్రెత్తిపోయారు. విమానశ్రయంలో అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలస్యంగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమయం మించిపోయిందని చెప్పినా వినకుండా ఆగ్రహంతో ఊగిపోయారు.
గురువారం ఉదయం ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా.. బోర్డింగ్ సమయం కంటే ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు వచ్చారు. దీంతో అధికారులు పాస్ ఇవ్వడానికి అంగీకరించలేదు. అధికారుల సమాధానానికి తీవ్ర ఆగ్రహానికి లోనైన జేసీ.. బోర్డింగ్ పాస్ ప్రింటర్ ను విసిరేసి రచ్చ రచ్చ చేశారు.

జేసీ నిర్వాకంపై విశాఖ ఎయిర్ పోర్టు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోను గన్నవరం ఎయిర్ పోర్టు సిబ్బంది పట్ల జేసీ దురుసుగా ప్రవర్తించారు. కాగా, గతంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎయిర్ పోర్టు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో జేసీ చేసిన హంగామాకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications