వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వైపే జెసి, బాబుపై ఫైర్: నోటీసుపై కాంగ్రెస్ డైలమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: అనంతపురం జిల్లా సీనయర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన మంగళవారం నోటీసులు, పార్టీ మారే అంశాలపై స్పందించారు. తనకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుండి ఇంకా ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదని చెప్పారు. తాను పార్టీలోనే ఉంటాను అని చెబుతుంటే, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెళ్లమంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీది రెండు కళ్ల సిద్ధాంతమని ఆరోపించారు. ఒక్క వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మాత్రమే తెలంగాణ విషయంలో స్పష్టత ఉందన్నారు. తాను పార్టీ మారే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తమపై చర్యలు తీసుకుంటారన్నది స్పష్టమయ్యాకే స్పందిస్తానని తెలిపారు. తమ పిల్లలు ఏ పార్టీలో చేరుతారన్నది వాళ్లిష్టమన్నారు. పార్టీ మారే విషయమై మాత్రం తాను ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.

జెసికి నోటీసుపై తర్జన భర్జన

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీనామా చేయాలని, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో ప్రయోజనం లేదన్న వ్యాఖ్యలపై జెసికి నోటీసు ఇచ్చే విషయమై పిసిసి తర్జన భర్జన పడుతోంది. ఏఐసిసి సభ్యుడైన జెసికి నోటీసు ఇచ్చే హక్కు తమకు లేదని క్రమశిక్షణా సంఘం చెప్పినట్లుగా తెలుస్తోంది. మీరే నిర్ణయం తీసుకోవాలని బొత్సకు లేఖ రాశారని సమాచారం. ఈ రోజు సాయంత్రం హైదరాబాదు రానున్న బొత్స ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.

ఎవరికీ భయపడను

జెసికి షోకాజ్ నోటీసు ఇచ్చింది లేనిది తాను బహిరంగంగా చెప్పలేనని పిసిసి క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ అన్నారు. తాను ఎవరికీ భయపడనన్నారు. జెసి వ్యాఖ్యల పైన గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేశామని చెప్పారు.

English summary
It is said that Congress Party senior leader and former Minister JC Diwakar Reddy may join in YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X