బాబులా జేడీ కాదు, వైస్రాయ్ హోటల్లో ఏం చేశారో: వర్మ సెటైర్
Recommended Video

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి వివాదాలతోనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అంతేగాక, ఈ సినిమాలో పాత్రలపైనా విస్తృత చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో రోజుకో కొత్త విషయం చెబుతూ సినిమాపై ఆసక్తి పెంచాలని చూస్తున్నారు వర్మ.

బాబు పాత్రపై వర్మ స్పందన
తాజాగా, తన ఫేస్బుక్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'లో అత్యంత కీలకమైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను జేడీ చక్రవర్తి పోషించనున్నాడని వచ్చిన వార్తలపై వర్మ స్పందించారు.

కాదంటూ స్పష్టత..
తన చిత్రం(లక్ష్మీస్ ఎన్టీఆర్)లో చంద్రబాబు పాత్రను జేడీ పోషించడం లేదని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా జేడీ ఆ పాత్రను పోషించడం లేదని వ్యాఖ్యానించారు.
మా మధ్యలో ఎవరో..
చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వర్మ చెప్పారు. తనకు, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మధ్య ఎవరో నటిస్తున్నారని అన్నారు. తనకు కూడా ఈ విషయం తెలియదని అన్నారు. అయితే, జేడీ మాత్రం కాదని తేల్చి చెప్పారు.

వైస్రాయ్ హోటళ్లో బాబు..
కాగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఏం చేశారన్న విషయం తనకు నిజంగా తెలియదని అన్నారు. ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీసేలా ఉన్నాయి. కాగా, ఈ చిత్రం గురించి రాంగోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మీపార్వతి పాత్రలో నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్న విషయం తోలిసిందే. ఈ విషయంపై వర్మ అడిగితే స్పందిస్తానని రోజా ఇప్పటికే చెప్పారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications