బాబులా జేడీ కాదు, వైస్రాయ్ హోటల్లో ఏం చేశారో: వర్మ సెటైర్
Recommended Video
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి వివాదాలతోనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అంతేగాక, ఈ సినిమాలో పాత్రలపైనా విస్తృత చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో రోజుకో కొత్త విషయం చెబుతూ సినిమాపై ఆసక్తి పెంచాలని చూస్తున్నారు వర్మ.
బాబు పాత్రపై వర్మ స్పందన
తాజాగా, తన ఫేస్బుక్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'లో అత్యంత కీలకమైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను జేడీ చక్రవర్తి పోషించనున్నాడని వచ్చిన వార్తలపై వర్మ స్పందించారు.
‘బాబు కుట్ర, భయమేసేది! ఇష్టం లేకుండా మొదటి పెళ్లి, ఎన్టీఆర్ వల్లే మళ్లీ': లక్ష్మీపార్వతి సంచలనం
కాదంటూ స్పష్టత..
తన చిత్రం(లక్ష్మీస్ ఎన్టీఆర్)లో చంద్రబాబు పాత్రను జేడీ పోషించడం లేదని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా జేడీ ఆ పాత్రను పోషించడం లేదని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ని తొలిసారి అక్కడే చూశా, ప్రేమ ఎప్పుడు పుట్టిందో: లక్ష్మీపార్వతి
మా మధ్యలో ఎవరో..
చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వర్మ చెప్పారు. తనకు, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మధ్య ఎవరో నటిస్తున్నారని అన్నారు. తనకు కూడా ఈ విషయం తెలియదని అన్నారు. అయితే, జేడీ మాత్రం కాదని తేల్చి చెప్పారు.
వైస్రాయ్ హోటళ్లో బాబు..
కాగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఏం చేశారన్న విషయం తనకు నిజంగా తెలియదని అన్నారు. ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీసేలా ఉన్నాయి. కాగా, ఈ చిత్రం గురించి రాంగోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మీపార్వతి పాత్రలో నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్న విషయం తోలిసిందే. ఈ విషయంపై వర్మ అడిగితే స్పందిస్తానని రోజా ఇప్పటికే చెప్పారు.
రోజాపై క్లారిటీ ఇస్తా, ఆ దమ్ముంది: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'పై రాకేష్ రెడ్డి సంచలనం