హైద్రాబాద్పై టికి జెడి అల్టిమేటం: షిండేకు కోట్ల తీర్మానం
యుటికి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మద్దతిస్తే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తామన్నారు. అరవయ్యేళ్లు కలిసున్నామని, మరో మూడేళ్లు యూటిలో కలిసి ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. హైదరాబాదు యుటి అయితే తెలంగాణకు వచ్చే నష్టమేమీ ఉండదన్నారు. కెసిఆర్ తీరు కాంగ్రెసుకు వ్యతిరేకమన్నారు.
హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమే అన్నారు. యుటికి ఒప్పుకుంటే టి బిల్లు సాఫీగా ముందుకు వెళ్తుందన్నారు. ఇది తెలంగాణ కాంగ్రెసు నేతలు ఆలోచించాలన్నారు. యూటికి సిద్దపడితే తాము విభజనకు సీమాంధ్ర ప్రజలను సముదాయిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీ ఇచ్చిన తెలంగాణ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసుకోవాలంటే సహకరించాలన్నారు.
రాయల టిపై కోట్ల
రాయల తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మంగళవారం చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని 1,700 గ్రామ సభల తీర్మాన కాపీలను షిండేకు కోట్ల అందజేశారు. ఈ కాపీలలో మంత్రి రఘువీరా రెడ్డి ప్రతిపాదనలు ఉన్నట్లుగా సమాచారం.