హెరిటేజ్ పాలను వాడుతూనే బాబును తిట్టా: జూపూడి
హైదరాబాద్: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను అనుసరించి మాత్రమే టిడిపి అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశానని చెప్పారు.
హెరిటేజ్ పాలు వాడితే క్యాన్సర్ వస్తుందని తాను విమర్శిస్తున్న సమయంలో కూడా.. తమ ఇంట్లో హెరిటేజ్ పాలనే వాడామని ఆయన ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఆలోచన విధానం మారిందని, ఆయన మార్గం తనకు నచ్చబట్టే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
దళిత అభ్యుదయానికి కృషి చేస్తానని జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. కొందరు కావాలనే తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు. తన ప్రశ్నలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి సమాధానం రాకపోవడంతోనే తాను ఆ పార్టీని వీడినట్లు చెప్పారు.

తుళ్లూరు మండలంలో అరటి తోటలకు నిప్పు: బాబు ఆరా
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాతిపాదిత ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అరటి తోటలకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో సుమారు రూ. 7లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గుంటూరు అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి రైతులను పరామర్శించారు.
కాగా, పెనుమాక, ఉండవల్లిలో డ్రిప్ పైపులు, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజధాని భూములు ఇవ్వడానికి నిరాకరించినందునే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తుళ్లూరులో అరటి తోటలకు నిప్పుపెట్టిన ఘటనపై ఏపి సిఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై గుంటూరు జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దుండగులను ఉపేక్షించరాదని కలెక్టర్ను ఆదేశించారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications