అసలు జెఎఫ్సి ఎందుకంటే;తేల్చిచెప్పిన జస్టిస్ గోపాల గౌడ;ఆయనెందుకు వచ్చారు?
Recommended Video

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడిని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం నేడు హైదరాబాద్ దసపల్లా హోటల్లో జరుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు మధు, నారాయణ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ తదిదరులతో పాటు పలువురు రాజకీయ,సామాజిక, ఆర్థిక, విద్య, న్యాయ నిపుణులు కూడా పాల్గొంటున్నారు.
తొలిరోజు సమావేశాల్లో కేంద్ర నిధులు, విభజన హామీలు వీటికి సంబంధించిన వివరాల సేకరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొంటున్నన్యాయమూర్తి గోపాల గౌడ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగిందని, అయితే ఏపీకి రావాల్సిన నిధులు సరిగా రావడంలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో తనకు చాలా సంతోషంగా ఉందని గౌడ చెప్పారు. న్యాయమూర్తిగా ఉన్న తాను ఈ కమిటీకి కావాల్సిన సలహాలు తప్పకుండా ఇస్తానన్నారు. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఏమేమి ఇచ్చింది...ఇంకా ఏమేమి ఇవ్వాల్సి ఉంది అనే దానిపై ఒక నివేదిక తయారు చేయడానికే ఈ జెఎఫ్సి ఏర్పడిందని, ఇందులో సందేహానికి తావులేదని జస్టిస్ గోపాల గౌడ స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్తో తనకు చాలా దగ్గరి సంబంధం ఉందని, తన తల్లిది చిత్తూరు జిల్లా అని జస్టిస్ గోపాల గౌడ చెప్పారు.
మరోవైపు జెఎఫ్సి సమావేశానికి వైసిపికి చెందిన తోట చంద్రశేఖర్ అనే నేత హాజరుకావడం చర్చనీయాంశం అయింది. ఇదే విషయమై తోట చంద్రశేఖర్ ను ప్రశ్నించగా తాను వ్యక్తిగతంగా సమావేశానికి హాజరయ్యానంటూ తోట చంద్రశేఖర్ మీడియాతో చెప్పడం గమనార్హం. నేడు, రేపు సమావేశఆల అనంతరం జేఎఫ్సీ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది!












Click it and Unblock the Notifications