కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు రమ్య ఏకేశారు, ఆర్ఎఫ్సీపై
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్న కుమార్తె రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం నాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం రమ్య మీడియాతో మాట్లాడారు. చిన్నాన్న కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు పొన్నాల లక్ష్మయ్యను విమర్శించే స్థాయిలేదన్నారు. పొన్నాల చెల్లని రూపాయి అని హరీష్ విమర్శించడాన్ని ఆమె ఖండించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉద్యమకారుని తరహాలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియాను పాతర వేస్తానని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని ఆమె చెప్పారు
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications