కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణ..! గెలుస్తానన్న భయంతో అదికారుల కుట్ర చేసారన్న పాల్..!
పశ్చిమ గోదావరి/హైదరాబాద్ : ప్రజాశాంతి అధినేత కే ఏ పాల్ మరో సారి కన్నీటి పర్యంతం అయ్యారు. ఎన్నిల అదికారులు తన గెలుపును నివారించేందుకు కుట్ర చేసారని ఘాటుగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటి మధ్యాహ్నం తో ముగిసింది. తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్కు అనుకోని ఘటన ఎదురైంది. అతని నామినేషన్ ని అధికారులు తీసుకోలేదు. దీంతో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్లు కుట్ర పన్నారని వారిపై కేఏ పాల్ మండిపడ్డారు. భీమవరంలో కేఏ పాల్ నామినేషన్ను వేసేందుకు వచ్చారు. కానీ అప్పటికే కాలాతీతం ఐనట్టు పాల్ గ్రహించలేక ఎక్కెక్కి ఏడ్చేసారు.

కేఏ పాల్ నాినేషన్ వేసే సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. నరసాపురంలో ఎంపీ నామినేషన్ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్ ఆరోపించారు. ఎన్నికల్లో తాను ఎక్కడ గెలుస్తానో అన్న భయంతోనే భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ ప్రత్యర్ధి పార్టీ నాయకుల్ని విమర్శించారు. ఇదిలా ఉండగా ఎపీగా నరసాపురంలో గెలిచి నేనేంటో చూపిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఆలస్యంగా వచ్చిన కారణంగానే పాల్ నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాల్ కాసేపు భావోద్వేగానికి గురయ్యారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications