పవన్కు బిగ్ షాక్..జనసేనకు కీలక నేత గుడ్ బై
సార్వత్రిక ఎన్నికల ముందు జనసేనకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొనడానికి టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టిన సంగతి అందరికి తెలిసిందే. అసలు ఈ కూటమి కార్యరూపం దాల్చడానికి ముఖ్య కారకుడే జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే కూటమి ఏర్పడిన తరువాత ఆ పార్టీ నుంచే ఎక్కువ వ్యతిరేకతం వ్యక్తం కావడం గమనర్హం. 40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇటీవలే అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జనసేన కీలక నేతల్లో పితాని బాలకృష్ణ కూడా పవన్ కల్యాణ్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా మరో కీలక నేతా జనసేనను వీడటానికి రెడీ అవుతున్నట్టు సమాచారం అందుతోంది.కాకినాడ సిటీ ఇంచార్జ్ ఉన్న ముత్తా శశిధర్ సైతం జనసేనను వీడటానికి సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో .కాకినాడ సిటీ నుంచి పోటీ చేశారాయన. గతంలో కాకినాడలో పర్యటించిన సమయంలో ఇక్కడి సీటును ముత్తా శశిధర్కే కేటాయిస్తానని పవన్ హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా ఆ సీటు ఇప్పుడు టీడీపీకి ఖారారు కావడంతో .. ముత్తా శశిధర్కు మొండిచేయి ఎదురైంది.
గడిచిన ఐదేళ్లుగా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేసి జనసేనను బలోపేతం చేశారాయన. టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్న ముత్తా శశిధర్ జనసేనకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన పవన్ కల్యాణ్ పర్యటనకు సైతం దూరంగా ఉన్నారు. దీంతో ముత్తా శశిధర్ జనసేనను వీడటం ఖాయమనే పార్టీ శ్రేణులు సైతం భావిస్తున్నాయి. ఒకటి , రెండు రోజుల్లో ముత్తా శశిధర్ తన రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications