ఎవరైనా అభినందించాల్సిందే: పవన్పై మంత్రి కామినేని
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రసంశించారు. ప్రజలకు మంచి చేయాలనుకునేవారు ఎవరైనా వారిని అభినందించాల్సిందేనని పవన్ను ఉద్దేశించి అన్నారు.
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రసంశించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను తీర్చేందుకు హార్వర్డ్ బృందాన్ని వచ్చేలా పవన్ కృషి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు మంచి చేయాలనుకునేవారు ఎవరైనా వారిని అభినందించాల్సిందేనని పవన్ను ఉద్దేశించి అన్నారు మంత్రి.
ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్కు ఆయన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్, హార్వర్డ్ బృందం సోమవారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమవుతారని అన్నారు.

ఉద్దానం సమస్యకు రాజకీయాలతో సంబంధం లేదని కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఉద్దానం సమస్య పూర్తిస్థాయి పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఉద్ధానం సమస్యను పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ప్రభుత్వం మరింత మెరుగైన సేవల కోసం చర్యలు తీసుకుందని మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. హార్వార్డ్ బృందంతో భేటీ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చంద్రబాబు, పవన్ చర్చిస్తారన్నారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications