అసలేమైంది?: బెజవాడ దుర్గమ్మకు ఇచ్చిన చీర మాయం!: ఫిర్యాదు చేయలేమని అధికారులు!
విజయవాడ: బెజవాడ కనకదుర్గగుడిలో అమ్మవారికి సారె రూపంలో వచ్చిన చీర మాయమైన ఘటనలో ఎలాంటి పురోగతి లేకుండా పోతోంది. ఘటనపై విచారణ విషయంలో పోలీసులు, దుర్గగుడి అధికారులు సాకులతో కాలయాపన చేస్తున్నారు తప్ప ముందుకు కదలడం లేదు.
భక్తులు చీర తెచ్చినట్లు రికార్డుల్లో నమోదు కానందున పోలీసులకు ఫిర్యాదు చేయలేమని దుర్గగుడి అధికారులు చెబుతుండటం గమనార్హం. అదే సమయంలో తమకు భక్తుల నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని పోలీసులు అంటున్నారు.

కాగా, విషయం తెలిసిన వెంటనే దుర్గగుడికి వచ్చిన పోలీసులు.. భక్తులు, అర్చకులు, పాలకమండలి సభ్యులను విచారించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ తర్వాత మాత్రం చర్యలకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. నిబంధనల మేరకు ఫిర్యాదు వస్తేనే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఇది ఇలావుంటే, అమ్మవారికి ఆ చీర సమర్పించిన భక్తులు సూర్యనారాయణ, వసుంధర మాత్రం పాలకమండలి సభ్యుడు పెంచలయ్య విజ్ఞప్తి మేరకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఇచ్చిన కానుకలు ప్రముఖ పుణ్యక్షేత్రంలోనే ఇలా మాయమవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications