సుఖ సంతోషాలు: శ్రీనివాసుడు శక్తిమంతుడని జయేంద్ర సరస్వతి(పిక్చర్స్)
తిరుపతి: తిరుమల శ్రీనివాసుడు అత్యంత శక్తిమంతమైన దేవుడని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి అన్నారు. శ్రీవారిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన ప్రహరీ ఉద్యానవనాలు బాగున్నాయని, భక్తులకు దేవస్థానం విశేషంగా సేవలందిస్తోందని ప్రశంసించారు. అంతకు ముందు పాత అన్నప్రసాద భవనం ముందు పీఠాధిపతికి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
అక్కడి నుంచి బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. శ్రీవారి ఆలయం నుంచి చక్రత్తాళ్వార్ను వూరేగింపుగా తీసుకువచ్చి పీఠాధిపతికి శఠారి సమర్పించారు. ఆలయ మర్యాదల ప్రకారం తితిదే ఈవో సాంబశివరావు దంపతులు స్వాగతం పలికి స్వామి సన్నిధికి తీసుకెళ్లారు.
జయేంద్ర సరస్వతి
తిరుమల శ్రీనివాసుడు అత్యంత శక్తిమంతమైన దేవుడని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి అన్నారు. శ్రీవారిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు.
జయేంద్ర సరస్వతి
ఈ సందర్భంగా ఆలయం ఎదుట మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
జయేంద్ర సరస్వతి
ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన ప్రహరీ ఉద్యానవనాలు బాగున్నాయని, భక్తులకు దేవస్థానం విశేషంగా సేవలందిస్తోందని ప్రశంసించారు. అంతకు ముందు పాత అన్నప్రసాద భవనం ముందు పీఠాధిపతికి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
జయేంద్ర సరస్వతి
అక్కడి నుంచి బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. శ్రీవారి ఆలయం నుంచి చక్రత్తాళ్వార్ను వూరేగింపుగా తీసుకువచ్చి పీఠాధిపతికి శఠారి సమర్పించారు. ఆలయ మర్యాదల ప్రకారం తితిదే ఈవో సాంబశివరావు దంపతులు స్వాగతం పలికి స్వామి సన్నిధికి తీసుకెళ్లారు.
జయేంద్ర సరస్వతి
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి చక్రత్తాళ్వార్ను పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి జయేంద్ర సరస్వతికి శటారి సమర్పణ చేశారు.
జయేంద్ర సరస్వతి
ఈ సందర్భంగా టిటిడి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జయేంద్ర సరస్వతి వెంట టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆలయ డిప్యూటి ఇఓ కోదండరామారావు, ఓఎస్డి డాలర్ శేషాద్రి, పేష్కార్ శెల్వం, ఇతర అధికార ప్రముఖులు ఉన్నారు.