Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీలోకి కన్నా ఎంట్రీ ముహూర్తం ఫిక్స్ - చంద్రబాబు హామీ..!?

చంద్రబాబు హామీతో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ అయింది.

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిక ఖరారైంది. ముహూర్తం ఫిక్స్ అయింది. బీజేపీకి రాజీనామాకు ముందే టీడీపీ నాయకత్వంలో చర్చలు...ఒప్పందం జరిగినట్లు సమాచారం. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత వరుసగా తన అనుచర వర్గంతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ - జనసేన నుంచి ఆఫర్ ఉందని అనుచరవర్గం చెబుతోంది.

తొలుత జనసేనలోకి వెళ్లాలని భావించినా కొన్ని ప్రత్యేక కారణాలతో టీడీపీలోకి కన్నా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ ఉందని సమాచారం. టీడీపీతో దాదాపు రెండున్నార దశాబ్దాల రాజకీయ పోరాటం చేసిన కన్నా లక్ష్మీనారాయణ పచ్చ కండువా కప్పుకొనేందుకు రంగం సిద్దమైంది.

టీడీపీలోకీ ఈ నెల 23న ఎంట్రీ

టీడీపీలోకీ ఈ నెల 23న ఎంట్రీ

బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. కొత్తగా ఏ పార్టీలో చేరాలనే అంశం పైన చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసారు. తారకరత్న మరణంతో నిర్ణయాలు ఏవీ ప్రకటించకుండానే సమావేశం ముగించారు. తారకరత్న మరణం పట్ల కన్నా సంతాపం ప్రకటించారు. ఇప్పటికే కన్నా టీడీపీలో చేరటం ఖాయమైంది.

బీజేపీ వీడాలని నిర్ణయించిన తరువాత తొలుత జనసేనతో సంప్రదింపులు జరిగాయాని సమాచారం. బీజేపీతో ఇంకా జనసేన పొత్తు కొనసాగుతున్న వేళ..బీజేపీ లో కీలక నేతగా ఉన్న కన్నాను చేర్చుకోవటం సరి కాదనే అభిప్రాయంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు సమాచారం. దీంతో..భవిష్యత్ పొత్తు కాయమని భావిస్తుండంతో ఇప్పుడు టీడీపీలో చేరాలని కన్నా డిసైడ్ అయ్యారు.

చంద్రబాబు నుంచి హామీ

చంద్రబాబు నుంచి హామీ

కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీ మధ్నాహ్నం 3 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కన్నాతో ఆయన ముఖ్య అనుచరవర్గం టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. కన్నా గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లా నుంచి సీనియర్ మంత్రిగా వ్యవహరించారు.

2014,2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీలో ఆయనకు రెండు సీట్ల పైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి కన్నా టీడీపీ అభ్యర్దిగా నిలబడే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ -జనసేన సీట్ల పంపకాలకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని సమాచారం.

మారుతున్న రాజకీయ సమీకరణాలు

మారుతున్న రాజకీయ సమీకరణాలు

బీజేపీకి రాజీనామా చేసిన తరువాత అనూహ్యంగా కన్నా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి బలం చేకూరింది. కాంగ్రెస్ లో దాదాపు రెండున్నార దశాబ్దాలు పని చేసిన కన్నా..టీడీపీ పైన రాజకీయంగా పోరాటం చేసారు. ఇప్పుడు టీడీపీ లో ఎంట్రీతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి కన్నా రాక పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే, చంద్రబాబు హామీతోనే కన్నా టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. కన్నా చేరికకు ముందే జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. దీంతో..ఈ నెల 23న కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా టీడీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+