చార్జీలు పెంచి... సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారు...
జగన్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి ఇచ్చిన మాట నుండి యూ టర్న్ తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో మాట తప్పను మడమ తిప్పను అని ప్రచారం చేసిన సీఎం చార్జీలు పెంచి యూటర్న్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రాన్ని వెనక్కి పరుగెత్తించాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చార్జీల పెంపుదల నేపథ్యంలోనే ప్రభుత్వానికి లేఖ రాశారు.

లేఖలో పలు అంశాలను ప్రస్తావించిన ఆయన వైఎస్ వివేకా హత్య కేసునును చేధించడంలో పోలీసులు వైఫల్యం చెందారని, కనీసం కేసులో నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని పేర్కోన్నారు. అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దృష్టి సారించలేదని ఆరోపణలు చేశారు. దీంతో పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన లేఖలో కోరారు.
More From
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications