కలలో కూడా: పవన్కళ్యాణ్పై అరుణ, జనసేన హెచ్చరిక
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేద్ర మోడీల కృషి వల్ల కేంద్ర, రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, పవర్ స్టార్ టీడీపీకి మద్దతు పలుకుతారని కలలో కూడా ఊహించలేదని పలువురు కాపు నేతలు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలో టీడీపీ పక్షాన గెలుపొందిన కాపు ప్రజాప్రతినిధులను బుధవారం గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.
ఏ ఒక్క సీటు ఆశించకుండా బీజేపీ, టీడీపీకి సంపూర్ణ మద్దతు పలికిన పవన్ను కాపులు అభినందించాలని టీడీపీ నేత చందు సాంబశివ రావు అన్నారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందని చెప్పారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ.. పవన్ టీడీపీకి మద్దతు పలుకుతారని కలలో కూడా ఊహించలేదన్నారు. పవన్ మద్దతివ్వడం అభినందనీయమన్నారు. కాపులు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు.

కాగా, గుంటూరులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. టీడీపీకి చెందిన కాపు నేతలు పవన్ కళ్యాణ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యడం కొత్త తగాదాకు తెర లేపిందట. గుంటూరు జిల్లాలో ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన కాపు నేతలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాపు నేతలకు చెందిన సన్మాన కార్యక్రమం సందర్భంగా గుంటూరులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ పేరును, ఫొటోను కాపు నేతలు బాగా హైలెట్ చేశారు. ఈ విషయం గుంటూరు జనసేన నేతలకు ఆగ్రహం తెప్పించిందట! పవన్ కళ్యాణ్ను ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ఏ మాత్రం సమంజసం కాదని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారట. ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, లేకపోతే తామే ఆ పని చేస్తామని వారు హెచ్చరించారట కూడా.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications