విజయమ్మపై పోటీ చేసి, ఓడిస్తా: అద్వానీతో కావూరి
బిజెపి అగ్రనేత ఆద్వానీతో కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు కావూరు సాంబశివరావు మంగళవారం భేటీ అయ్యారు. విశాఖ సీటును తనకు కేటాయిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయలక్ష్మిని ఓడిస్తానని ఆద్వానీతో కావూరు చెప్పినట్లు తెలిసింది. అయితే, విశాఖపట్నం సీటును ఆయనకు బిజెపి ఇవ్వడానికి మొగ్గు చూపలేదు.
కొద్దిరోజులుగా ఆయన సీటుకోసం బిజెపి నాయకులను తరచుగా కలుస్తున్నారు. అయితే ఆయన అభ్యర్థనను పట్టించుకోకుండానే బిజెపి మంగళవారం రాత్రి విశాఖ టికెట్ను హరిబాబుకు ఖరారు చేసింది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కావూరి సాంబశివ రావు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయన బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. అయితే, ఆయన లోకసభ సీటు కోసం తీవ్రంగానే ప్రత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
Comments
kavuri sambasiva rao visakhapatnam bjp lok sabha election 2014 పురంధేశ్వరి విశాఖపట్నం బిజెపి లోకసభ ఎన్నికలు 2014
English summary
It is said that former union minister Kavuri Sambasiva Rao appeal for Visakhapatnam Lok Sabha seat has been ignored by BJP leadership.
Story first published: Wednesday, April 16, 2014, 8:07 [IST]