పోలవరం ముంపు గ్రామాలాపై సుప్రీంకు వెళ్తాం: కెసిఆర్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాల్లో అత్యధిక గ్రామాలను ఆంధ్రాలో కలపాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించి, దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని యోచిస్తుండడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మండిపడుతున్నారు.
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంపై తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశానని, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా హెచ్చరించానని, అయినా వారు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.
తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి రాజముద్ర వేసిన సిరా తడి ఆరకముందే తెలంగాణకు అన్యాయం జరిగేలా ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం బాధాకరమని తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications