పావులు కదిపిన KCR... పక్కా పొలిటికల్ స్కెచ్?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించడం వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రణాళిక ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నూతన చీఫ్ సెక్రటరీగా నియమితులైన శాంతికుమారి బీఆర్కే భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. 2025 ఏప్రిల్ వరకు ఆమె పదవీకాలం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె మెదక్ కలెక్టర్ గా పనిచేశారు.

చకచకా పావులు కదిపిన కేసీఆర్
రాజకీయ వ్యూహాల్లో గండర గండడుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ సోమేష్ కుమార్ నియామకంపై తీర్పు రావడంతో చకచకా పావులు కదిపారు. ఇటీవలే ఏపీలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ తోపాటు మరికొందరు కాపు నాయకులను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో కాపుల ఓటుబ్యాంకుపై కేసీఆర్ దృష్టిపెట్టారని వార్తలు వచ్చాయి. తాజాగా సీఎస్ గా నియమితులైన శాంతి కుమారి కూడా కాపు సామాజికవర్గాని చెందినవారే కావడం విశేషం.

శాంతికుమారిది కృష్ణా జిల్లా
భారత రాష్ట్ర సమితిని జాతీయ రాజకీయాల్లో విస్తరింపచేసి దేశవ్యాప్తంగా సత్తా చాటాలని కేసీఆర్ చూస్తున్నారు. జాతీయ పార్టీ హోదా సాధించే క్రమంలో అవసరమైన ఓట్ల శాతం తెచ్చుకునేందుకు ఆయన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రపై దృష్టిపెట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన శాంతికుమారిని చీఫ్ సెక్రటరీగా నియమించినందుకు బీఆర్ ఎస్ ఏపీ కాపు నాయకులు కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ బహిరంగసభ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలో బలోపేతమయ్యే చర్యల్లో భాగంగానే శాంతికుమారి వైపు కేసీఆర్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

కాపు ఓటుబ్యాంకు కోసం..
ఏపీలో కాపు సామాజికవర్గానికి మరింత చేరువయ్యేందుకు సీఎస్ ఎంపిక ఉపయోగపడుతుందని, రానున్న ఎన్నికల్లో అనుకున్న సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకోవడానికి శాంతికుమారి ఎంపికను కేసీఆర్ పునాదిగా చేసుకున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆమెను సీఎస్ గా ఎంపిక చేయడంపై ఏపీలోని కాపు వర్గం నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అలాగే కాపులకు చేరువయ్యేందుకు మరిన్ని చర్యలు చేపడితే కాపు ఓటుబ్యాంకు బీఆర్ఎస్ కు స్థిరంగా ఉండిపోతుందనేది కేసీఆర్ భావనగా ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications