ఇఫ్తార్ విందులో కెసిఆర్, అలీ: తినిపించారు(పిక్చర్స్)
హైదరాబాద్: ఉపాధి రంగంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రంజాన్ మాసం పురస్కరించుకుని శుక్రవారం రాత్రి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య, ముస్లిం మత పెద్దలు, టిఆర్ఎస్ ప్రతినిధులు, భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
కెసిఆర్
ఉపాధి రంగంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.
కెసిఆర్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు.
కెసిఆర్
రంజాన్ మాసం పురస్కరించుకుని శుక్రవారం రాత్రి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కెసిఆర్
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య, ముస్లిం మత పెద్దలు, భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
కెసిఆర్
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కెసిఆర్
మైనార్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కెసిఆర్ అన్నారు.
కెసిఆర్
బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.