తెలంగాణ వంటకాల రుచి చూసిన కెసిఆర్: నాలాగే ఈటెల సన్నగా...
హైదరాబాద్: తెలగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులతో కలిసి శుక్రవారంనాడు భోజనం చేశారు. ప్లీనరీ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సమావేశం జరిగిన ఎల్బీ స్టీడియంలోనే భోజనాలు ఏర్పాటు చేశారు.
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి, వేణుగోపాల చారిలతో పాటు కలిసి కెసిఆర్ భోజనం చేశారు. కెసిఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అక్కడే భోజనం చేశారు. ఆమె ఇతర మహిళా నాయకులు వడ్జించడం కనిపించింది.
టిఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నోరూరించే తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ వంటకాల ఘాటు వాసనలు కూడా అలుముకున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్కు ఇదే తొలి ప్లీనరీ.
కెసిఆర్ మాదిరిగానే ఈటెల
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాదిరిగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సన్నగా ఉంటాడని కెసిఆర్ అన్నారు. తన అధ్యక్షోపన్యాసంలో ఈటెల రాజేందర్ ప్రస్తావన తెస్తూ ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా పాఠశాలల్లో సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని ఆందించలేదని కెసిఆర్ చెప్పారు.
తాను హాస్టల్లో ఉండి చదువుకున్నానని, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం భోజనం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని తమ్ముడు ఈటెల రాజేందర్ కోరాడని, ఏ మాత్రం ఆలోచించకుండా సన్న బియ్యం మంజూరు చేయాలని ఆదేశించానని కెసిఆర్ వివరించారు.
రాష్ట్ర విభజనకు ముందు ఉడకని అన్నం, దొడ్డు బియ్యం అన్నం తిన్న హాస్టల్ విద్యార్తులకు సన్న బియ్యం అందించామని కెసిఆర్ చెప్పారు. సన్న బియ్యం పథకానికి ఛాంపియన్ తమ్ముడు రాజేందరే అని ఆయన అన్నారు