నాయినికి కెసిఆర్ పరామర్శ: మంత్రులతో భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారంనాడు సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు. స్వల్ప అస్వస్థతకు గురై నాయని నర్సింహారెడ్డి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కెసిఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలావుంటే, శాసనసభ కార్యదర్శి రాజా సదారాం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావునను కలిశారు. అసెంబ్లీ సమావేశాలపై ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ నెల 20వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జెన్కో, బిహెచ్ఇఎల్ అధికారులు శనివారంనాడు సమావేశమయ్యారు. మణుగూరు, కొత్తగూడెం విద్యుత్తు ప్లాంట్ల ఎంఓయులపై వారు చర్చించినట్లు సమాచారం.

ఇదిలావుంటే, తన అధికారిక నివాసంలో కెసిఆర్ శనివారంనాడు మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆబ్కారీ మంత్రి పద్మారావు, ఎంపి కె. కేశవ రావు, శానసభ్యుడు శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications