పొడిచేస్తాను అన్న ఆ మనిషి ఎక్కడ, లోకేష్ సవాల్ను స్వీకరించలేదేం: పవన్పై కేఈ
కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గురువారం తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఏదో పొడిచేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన ఆ పెద్ద మనిషి ఎక్కడ అన్నారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
Recommended Video
కేఈ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం పొడిచేస్తాను అన్న పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ ఎక్కడా అని నిలదీశారు. ఏపీకి హోదా కోసం ఆమరణ నిరాహారా దీక్ష చేస్తానని చెప్పిన మనిషి కనిపించడే అని ఎద్దేవా చేశారు. అవిశ్వాసం పెట్టాలని ఘోషించిన పెద్దమనిషి ఎక్కడ అన్నారు.
మోడీ పారిపోతున్నారని నేను అనను!: మోడీ ప్రభుత్వంపై టీడీపీ అలా, సుజన ఇలా
ఏపీ రాజకీయాలు చాలా బాధాకరంగా ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల ప్రవర్తన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నాయన్నారు. మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్ విసిరితే పవన్ కళ్యాణ్ ఎందుకు స్వీకరించలేదని నిలదీశారు. రాజధాని భూముల విషయంలో అవినీతి జరగలేదని, దానికి తావు లేదన్నారు. సరైన సమయంలో అందరికీ బదులిస్తామని చెప్పారు.
పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో మండలాలను పెంచబోతున్నట్లు కేఈ కృష్ణమూర్తి తెలిపారు. తొలి విడతగా 3 అర్బన్ మండలాలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో కొత్తగా ఏర్పడే మండలాలు మహారాణిపేట, గోపాలపట్నం, ములగాడలు అని చెప్పారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో అర్బన్ మండలం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
విజయవాడలో మూడు అర్బన్ మండలాలపై అభ్యంతరాలు పరిశీలిస్తున్నామన్నారు. ఏపీలో 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని చెప్పారు. మరో పదహారు డివిజన్ల కోసం కలెక్టర్లు ప్రతిపాదనలు పంపించారని చెప్పారు. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు నాలా చట్టం అన్నారు. భూ వినియోగ మార్పిడిని సవరించి రుసుములు తగ్గించామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నంలలో రెండు శాతం, మిగిలిన జిల్లాల్లో 3 శాతం చెల్లించాలన్నారు.