గుంటూరు బాలిక కిడ్నాప్: కాశ్మీర్ తీసుకెళ్లిన ఆటో డ్రైవర్, పట్టేసిన పోలీసులు
గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలులో ఇటీవల లిఖిత (13) అనే బాలిక అదృశ్యమైంది. తమ కూతురి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు: జిల్లాలోని భట్టిప్రోలులో ఏప్రిల్ 21న కిడ్నాపైన లిఖిత (13) అనే బాలిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తమ కూతురి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన లిఖిత తల్లిదండ్రులు గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు పురోగతి సాధించారు. లిఖిత జమ్మూకాశ్మీర్లోని సాంబాలో ఉందని గుర్తించిన పోలీసులు.. ఆ బాలికను ఓ ఆటోడ్రైవర్ అపహరించి తీసుకెళ్లినట్లు తేల్చారు.
జమ్మూకాశ్మీర్కు వెళ్లిన గుంటూరు పోలీసులు ఆటోడ్రైవర్ నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద లిఖిత ఉన్నట్లు సమాచారం. కాగా, తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
Comments
guntur girl kidnap auto driver police Jammu Kashmir గుంటూరు బాలిక కిడ్నాప్ ఆటో డ్రైవర్ పోలీసులు జమ్మూకాశ్మీర్
English summary
It is said that Kidnapped guntur girl found in Jammu Kashmir.