కదిరిలో సంచలనం:పోలీసు యూనిఫారంతో వచ్చి కిడ్నాప్
కదిరి :అనంతపురం జిల్లా కదిరి లో చోటుచేసుకొన్న కిడ్నాప్ ఘటన సినిమాను తలపించింది. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల యూనిఫారంలో వచ్చి కిడ్నాపర్లు కిడ్నాప్ కు పాల్పడడం సంచలనం కల్గించింది.
కదిరి పట్టణానికి చెందిన ప్రేమనాథ్ రెడ్డిని నలుగురు వ్యక్తులు బుదవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు.బైక్ లపై పోలీస్ యూనిఫారంలో వచ్చిన కిడ్నాపర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెప్పారు.

కడప జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ రెడ్డే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు ప్రేమనాథ్ రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ప్రేమనాథ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలు మిత్రులు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతాప్ రెడ్డికి ప్రేమ్ నాధ్ రెడ్డి రూ.3.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బులను చెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నాడు.
డబ్బులు చెల్లించకపోవడంతో ప్రతాప్ రెడ్డికి ప్రేమ్ నాథ్ రెడ్డి నోటీసులు పంపాడు. తనకే నోటీసులు పంపుతావా అంటూ ప్రతాప్ రెడ్డి గతంలో బెదిరించారని ప్రేమనాథ్ రెడ్డి కుటుంబసబ్యులు ఆరోపించారు.పోలీసు యూనిపారంలో వచ్చి కిడ్నాప్ కు పాల్పడింది ప్రతాప్ రెడ్డి మనుషులేనని ప్రేమనాథ్ రెడ్డి సతీమణి లక్ష్మి ఆరోపించారు..
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications