పిక్చర్: కిరణ్ రెడ్డి డ్రైవింగ్ లెసెన్స్ పునరుద్ధరణ
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తన డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యూవల్ చేసుకున్నారు. తన లైసెన్స్ను ఆయన గురువారం మధ్యాహ్నం రెన్యూవల్ చేసుకున్నారు.
హైదరాబాదులోని ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి వచ్చి అందుకు సంబంధించిన డిజిటల్ సంతకం చేశారు. ఆయన సతీమణి రాధికారెడ్డి పేరున ఐ20 కారు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఆ కారుకు ఎపి 09సివి1818 నంబర్ను ఎంపిక చేసుకున్నారు.
జెటిసి రఘుప్రసాద్,త ఆర్టీవోలు జిపిఎన్ ప్రసాద్, దశరథం తదితరులు దగ్గరుండి పనును చేయించారు. రవాణా కార్యాలానికి వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అందరి దృష్టినీ ఆకర్షించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. తన పార్టీ అభ్యర్థులను ఆయన ఎన్నికల బరిలోకి కూడా దించుతున్నారు. తాను మాత్రం లోకసభకు పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు ఇటీవల ఆయన చెప్పారు.