జగన్ సూచన -కొడాలి నాని నిర్ణయం వాయిదా..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని మౌనంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, టీడీపీ లక్ష్యం విరుచుకుపడ్డ నాని తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో నే నాని ప్రకటించారు. ఇక, ఇప్పుడు వరుస కేసులు నమోదవుతన్న వేళ కొడాలి నాని పార్టీ అధినేత జగన్ తో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. ఆ తరువాత కొడాలి నాని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
నాని కీలక ప్రకటన
కొడాలి నాని 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని గతంలో స్పష్టం చేసారు. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. అయితే, తాజా ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయారు. కొద్ది రోజులుగా కొడాలి నాని పైన వరుసగా కేసులు నమోదువుతున్నాయి. కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం అభ్యర్దిస్తున్నారు. ఈ సమయంలో కొడాలి నాని గతం కంటే భిన్నంగా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఇక..నాని గతంలో చేసిన ప్రకటన ఆధారంగా నాని రానున్న రోజుల్లో రాజకీయంగా పూర్తిగా దూరం అవుతారంటూ ప్రచారం మొదలైంది.

జగన్ సూచనలతో
ఈ సమయంలో కొడాలి నాని తాజాగా మాజీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తాజా పరిణామాల పైన చర్చించారు. ప్రస్తుతం పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్య నేతలకు జగన్ సూచించారు. దాడులు ఎదుర్కొంటున్న కేడర్ కు భరోసా ఇవ్వాలని నిర్దేశించారు. తాను జిల్లాల పర్యటనలకు వెళ్తానని వెల్లడించారు. జగన్ తో భేటీ తరువాత జిల్లాలో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లాలని కొడాలి నాని నిర్ణయించారు. ఈ మేరకు పేర్ని నానితోనూ చర్చలు చేసారు. పార్టీ పరంగానూ కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
నాని నిర్ణయం ఏంటి
మరో వైపు కొడాలని నానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. కొడాలి నానితోపాటు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, నాటి జాయింట్ కలెక్టర్ (జేసీ) మాధవీలతపై పోలీసులు కేసు పెట్టారు. ఈ మేరకు దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి వీరి ముగ్గురుపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై గుడివాడలో కేసు దాఖలైంది. తమను బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొడాలి నానిపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో నాని హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు సూచించింది. కేసులు..రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న కొడాలి నాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications