ఇంట్లో దీక్ష, 3గంటలకోసారి లోపలికి: జగన్పై కోడెల ఫైర్
హైదరాబాద్: ఇంట్లో కూర్చొని దీక్షలు చేసే వారిని తాను ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ...ఇంట్లో దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి మూడు గంటలకోసారి ఇంట్లోకి వెళ్లారని తెలిపారు. దానిని దీక్ష అంటారా అని కోడెల ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన ఇరుప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గతంలో ఢిల్లీలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు దీక్షను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి బుధవారం విమర్శించడంతో కోడెల ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లుపై న్యాయ సహాయం కోరాలని కోడెల శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంశంతో యూపిఏ సర్కారు మైనార్టీలో పడిందని అన్నారు. సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోబోమని కోడెల శివప్రసాద్ హెచ్చరించారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications