ఈవీఎంలపై కోన వెంకట్ అనుమానం?: కర్ణాటక ఎన్నికలపై పరోక్షంగా సెటైర్!
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు అనుమానాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే బీజేపీ గెలిచిందని వారు ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ కొంతమంది నెటిజెన్స్ ఇదే అనుమానాన్ని లేవనెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ రచయిత, నిర్మాత కోన వెంకట్ సైతం ఈవీఎంలపై పరోక్షంగా తన అనుమానాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈవీఎం వల్లే మోడీ గెలిచారన్న రీతిలో ఆ ట్వీట్ ఉండటం గమనార్హం.
'ఈరోజు కర్ణాటకలో ఈవీఎంలను ఓపెన్ చేయగానే.. అప్పుడే ఫలితం ఈవీఎం అని తేలిపోయింది. ఈవీఎం అంటే ఎవ్రీ బడీ ఓటెడ్ ఫర్ మోడీ(ప్రతీ ఒక్కరూ మోడీకే ఓటేశారు) అని. ఇక నో కామెంట్స్' అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటక రిజల్ట్స్: ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానం, ఫిర్యాదుకు రెఢీ