ద్రోహులకి టిక్కెట్లా: సురేఖపై కెసిఆర్కి కోదండ, ఇరకాటం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆదివారం పరోక్ష విమర్శలు గుప్పించారు. తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఎలా ఇస్తారని కోదండ పరోక్షంగా ప్రశ్నించారు.
మాజీ మంత్రి కొండా సురేఖ, తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిలు ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. ఉద్యమ ద్రోహులకు టిక్కెట్లు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి వారికి నాయకత్వం అప్పగిస్తే, టిక్కెట్లు ఇస్తే ప్రజల విశ్వాసం సన్నిగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొండా సురేఖ, మహేందర్ రెడ్డి, తూర్పు జయప్రకాశ్ రెడ్డిలు ఉద్యమ ద్రోహులే అన్నారు. వారికి టిక్కెట్లు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై తాము త్వరలో ఓ నిర్ణయానికి వస్తామని కోదండ చెప్పారు.
ఇరుకునపడ్డ తెరాస
ఉద్యమ ద్రోహులకు టిక్కెట్లు ఎలా ఇస్తారన్న కోదండరామ్ వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర సమితి ఇరుకున పడింది. ఉద్యమాన్ని అడ్డుకున్న వారికి టిక్కెట్లు ఇలా ఇస్తారని జెఏసి పరోక్షంగా ప్రస్తావించడం, పెద్దపల్లి ఎంపి వివేక్ ఢిల్లీలో కాంగ్రెసు పెద్దలతో కలిసిన నేపథ్యంలో కెసిఆర్ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications