జగన్ సభపై కొండా సురేఖ వార్న్, 16కంపెనీల బలగాలు

జగన్ సభకు భారీ బందోబస్తు
ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరయ్యే కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఎంపిక చేశారు.
బుధవారం నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడలించారు. ఎపిఎస్పీకి చెందిన 34 ప్లటూన్లతోపాటు కేంద్ర పారా మిలటరీకి చెందిన పదహారు కంపెనీలను రంగంలోకి దింపుతున్నారు. 1800 మంది సివిల్ పోలీసులను బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు.
ఎన్టీఆర్ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్లో వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. స్టేడియంలో ప్రవేశానికి సంబంధించి అన్ని ఇన్నర్ గేట్లను తెరుస్తామని చెప్పారు. ఎపిఎన్జీవో సభ సందర్భంగా నిజాం కళాశాల వద్ద జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications