వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంచికా?.. చెడుకా?.. వేచి చూస్తే తెలుస్తుంది: తమిళ పాలిటిక్స్పై రోశయ్య
తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం మంచికా?.. చెడుకా?.. అన్నది తానేమి చెప్పలేనని రోశయ్య పేర్కొన్నారు. విద్యాసాగర్ రావు బాగా చదువుకున్న వ్యక్తి అని, ఆయనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
హైదరాబాద్: ఉత్కంఠను రేకెత్తిస్తోన్న తమిళ రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య స్పందించారు. గవర్నర్ విద్యాసాగర్ రావు సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు ఇలాంటి పరిస్థితులు కొత్తేమి కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం మంచికా?.. చెడుకా?.. అన్నది తానేమి చెప్పలేనని రోశయ్య పేర్కొన్నారు. విద్యాసాగర్ రావు బాగా చదువుకున్న వ్యక్తి అని, ఆయనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మరికొద్ది గంటలు వేచి చూస్తే.. నిర్ణయం ఏంటనేది తెలుస్తుందని, నిర్ణయం వెలువడ్డాక పరిస్థితులు చక్కబడుతాయని రోశయ్య తెలిపారు.
కాగా, తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్రావుతో ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం భేటీ ముగియగా.. రాత్రి 7.30గం.లకు శశికళ గవర్నర్తో భేటీ కానున్నారు.
Comments
konijeti rosaiah tamilnadu politics panneer selvam sasikala vidyasagar rao కొణిజేటి రోశయ్య పన్నీర్ సెల్వం శశికళ విద్యాసాగర్ రావు
English summary
Former Tamilnadu Governor Konijeti Rosaiah responded on Tamil Nadu Politics. He said Raj Bhavan should not be a platform for politics while doubting the delay of Governor Vidyasagar Rao.
Story first published: Thursday, February 9, 2017, 17:41 [IST]