ఏపీలో మరో కొత్త పార్టీ: రేపు సొంత పార్టీ ప్రకటించనున్న కొత్తపల్లి గీత
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకు రానుంది. అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన అంటే రేపు ఉదయం పదకొండున్నర గంటలకు కొత్త పార్టీ పేరును చెప్పనున్నట్లు వెల్లడించారు. లేదా ఎల్లుండి ప్రకటించనున్నారని సమాచారం.
విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని మె అన్నారు.

కాగా, కొత్తపల్లి గీత 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీకి దూరం జరిగారు. తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ పార్టీకి కూడా దూరం పాటిస్తున్నారు. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ సాగింది. కానీ ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టనుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications