ఏపీలో మరో కొత్త పార్టీ: రేపు సొంత పార్టీ ప్రకటించనున్న కొత్తపల్లి గీత
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకు రానుంది. అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన అంటే రేపు ఉదయం పదకొండున్నర గంటలకు కొత్త పార్టీ పేరును చెప్పనున్నట్లు వెల్లడించారు. లేదా ఎల్లుండి ప్రకటించనున్నారని సమాచారం.
విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని మె అన్నారు.

కాగా, కొత్తపల్లి గీత 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీకి దూరం జరిగారు. తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ పార్టీకి కూడా దూరం పాటిస్తున్నారు. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ సాగింది. కానీ ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టనుండటం గమనార్హం.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications