Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెల్ఫీ దిగుతూ అట్లాంటా వాటర్‌ఫాల్స్‌లోకి- అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి..

సెల్ఫీ మోజు ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన ఓ యువతికి ప్రాణాల మీదకు తెచ్చింది. ఉద్యోగం కోసం జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి వాటర్‌ ఫాల్స్‌ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి మృత్యువాత పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది.

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు కమల అనే 26 ఏళ్ల యువతి ఇంజనీరింగ్‌ పూర్తి చేసి అమెరికాలో వెళ్లింది. అక్కడ ఎంఎస్‌ పూర్తి చేసుకుని కొలంబియాలో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం చేస్తోంది. శనివారం అట్లాంటాలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ అక్కడే ఉన్న జలపాతం వద్ద ఆగింది. జలపాతం అందాలు తిలకించాక సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కాలు జారి అందులో పడిపోయింది. తనతో పాటు వెళ్ళిన వారికి కూడా కాపాడే అవకాశం లేకపోవడంతో స్ధానిక పోలీసులకు సమాచారం అందించారు.

krishna district women died while taking selfie at atlanta waterfalls in us

Recommended Video

    Donald Trump : US President Trump Nominated For 2021 Nobel Peace Prize || Oneindia Telugu

    వెంటనే రంగలోకి దిగిన పోలీసులు ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అమెరికాలోని నాట్స్‌ సంస్ధ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషయం తెలియగానే కృష్ణాజిల్లాలోని ఆమె స్వగ్రామం గుడ్లవల్లేరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమార్తె ఇలా హఠాన్మరణం చెందడంత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+