కృష్ణాష్టమి సెలవు పై తాజా ఆదేశాలు- కీలక మార్పు..!!
కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుపుకోవటానికి సర్వం సిద్దం అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4, శుక్రవారం రోజు శ్రావణ శుద్ధ అష్టమి, రోహిణి నక్షత్రం కలిసి వచ్చినందున ఈ రోజునే శ్రీకృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. దీంతో, కృష్ణాష్టమి సెలవు పైనా స్పష్టత వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలవు ప్రకటించారు. వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకృష్ణుడు జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. దీంతో, ఈ పర్విదినాన సాధారణంగా సెలవు ప్రకటిస్తారు. అయితే, ఈ సారి పండుగ జరుపుకునే ముహూర్తం పైన కొంత చర్చ జరిగింది. కాగా.. పండితులు స్పష్టత ఇచ్చారు. దీంతో.. సెప్టెంబర్ 4న దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి పండగ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ఉండనుంది.

ప్రైవేట్ స్కూళ్లకు కూడా సెలవు ఉంది. కానీ, ప్రైవేట్ కార్యాలయా ల సెలవులో మార్పు చేసారు. కొన్ని కార్యాలయాలు యథావిధిగా పని చేయనున్నాయి. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇక.. ప్రతీ చోటా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, కృష్ణాష్టమి తో పాటుగా వరుసగా మూడు రోజులు సెలవుల పైనా స్పష్టత వచ్చింది.
కృష్ణాష్టమి సెలవు స్కూల్లతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవు ఇచ్చారు. కాగా, ఇక.. నాలుగో తేదీతో పాటు, ఐదో తేదీన టీచర్స్ డే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత ఆరో తేదీ ఆదివారం కావడంతో, ఇలా వరుసగా మూడు రోజుల పాటు విద్యార్థులకు సెలవు లు రానున్నాయి. అదేవిధంగా, ఈ నెలలో సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీనివల్ల సెప్టెంబర్ 12 రెండో శనివారం, 13న ఆదివారం, 14వ తేదీ వినాయక చవితి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.
ఈ విధంగా ఒకే నెలలో రెండుసార్లు విద్యార్థులకు వరుస సెలవులు రావటంతో విద్యార్ధుల పేరెంట్స్ ప్రయాణాలకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. వీటితో పాటుగా ఇదే నెలలో సెప్టెంబర్ నెలలో 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారాలు ఉండటం వల్ల స్కూళ్లతో పాటు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు. దీంతో.. ఈ నెలలో భారీగా వచ్చిన సెలవులతో విద్యార్ధులు హ్యాపీ మూడ్ లో ఉంటారు.














Click it and Unblock the Notifications