సూపర్: పవన్ కళ్యాణ్కు కేటీఆర్ ఫోన్, జనసేనాని థ్యాంక్స్, కారణం ఇదీ!
అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ఫోన్ చేశారని తెలుస్తోంది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ పైన జనసేన నిర్వహించిన కవాతు విజయవంతం కావడంపై పవన్కు కేటీఆర్ అభినందించారు. కేటీఆర్కు పవన్ థ్యాంక్స్ చెప్పారు.
మరోవైపు, కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నేతల పైన నిప్పులు చెరిగారు. తాను 2006 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పోరాడానని చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారు ఆ సమయంలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. తన గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ నేతలు హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

నేను నమ్మింది నిజమైంది
కాగా, పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ధవళేశ్వరం బ్యారేజీ పైన కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం మరుసటి రోజు జనసేన కవాతుపై ఆ పార్టీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. మనకు కావలసింది అధికారం కాదని, మార్పు అని, అది రావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలని, బాధ్యతతో కూడిన యంత్రాంగం కావాలని, ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థని ఊరట కలిగించడానికే తన వంతుగా పార్టీ పెట్టానని, పార్టీ పెట్టినప్పుడు ఐదుగురు కూడా లేరని, కానీ నా వెంట అందరూ వస్తారని విశ్వసించానని, అది నిజమైందన్నారు.

కవాతుకు వచ్చిన జనాన్ని చూసి ఖిన్నుడినయ్యా
నాకు భగవంతుని ఆశీస్సులున్నాయని, కవాతుకు లక్షలాదిగా జనం వస్తుంటే చూసి ఖిన్నుడనైపోయానని, తూర్పు గోదావరి జిల్లాకు జనసేన ద్వారా చేయాల్సింది చేద్దామని, శ్రీకాకుళంలో తుపాను బాధితులను పరామర్శ అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కవాతుకు తరలి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు.

పవన్ను కలిసిన పలువురు నేతలు
ఇదిలా ఉండగా, రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్లో పలువురు నేతలు పవన్ కళ్యాణ్ను కలిశారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు పంతం మోహన్గాంధీ, రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరి, పార్టీ నేతలు గురుదత్త ప్రసాద్, పంతం నానాజీ, అత్తి సత్యనారాయణ, కృష్ణారావు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కలిశారు.

పవన్ కళ్యాణ్ను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులు
మంగళవారం కూడా సాయంత్రం ఆయన విశాఖపట్నం వెళ్లేందుకు బయటకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేయడంతో ఆయన కారు పైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. షెల్టన్ హోటల్ నుంచి కర్రి సూర్యానారాయణ రెడ్డి పెట్రోల్ బంక్ వరకు రోడ్ షోలా నిర్వహించారు. కాగా, ఆయన బుధవారం శ్రీకాకుళం టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించారు.
-
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications