"యాపిల్ ఫోన్ ఇక నుంచి మేడ్- ఇన్ కుప్పం"

జగన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని.. రూ.11 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి, రాష్ట్రాన్ని నకిలీ మద్యం, అక్రమ మైనింగ్, కిడ్నాప్‌ లు, అత్యాచారాలు, ఫేక్ పోస్టులు, గంజాయి వ్యాపారంతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
అన్నారు.

శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆ సంకల్పంలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత 16 నెలల నుంచి దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్‌ తోపాటు పలు దేశాలు తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చారని అన్నారు.

ఇప్పటివరకు రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించారని చెప్పారు. ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అమెరికా దిగ్గజం యాపిల్ కోసం ఐఫోన్ చాసిస్‌ కు అవసరమైన హై-గ్రేడ్ అల్యూమినియం ఇక నుంచి కుప్పం నుంచే సరఫరా అవుతుందని తెలియజేశారు. హిందాల్కో రూ.586 కోట్ల పెట్టుబడితో కుప్పంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని దీని ద్వారా 613 ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు లాజిస్టిక్స్, సేవలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వేలాది అనుబంధ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌ లోకి లాగే గేట్‌ వే గా కుప్పం మారిందని ఆమె అన్నారు. చంద్రబాబు- లోకేష్ కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తుంటే సిగ్గులేకుండా జగన్ రెడ్డి దొంగ మెయిల్స్ పంపి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. జగన్‌ కు తన సొంత పరిశ్రమలైన.. నకిలీ మద్యం పరిశ్రమ, అక్రమ మైనింగ్ దందా, గంజాయి వ్యాపారం, మహిళలను కిడ్నాప్ చేసి వ్యాపారం చేసే పరిశ్రమలు మూతపడతాయని జగన్ భయంతో ఉన్నారు. జగన్ పీపీఏలు రద్దు చేయడంతో ప్రజల సొమ్ము రూ.10 వేల కోట్లు ఫైన్ కట్టాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.

Kuppam s Golden Leap Apple iPhone Chassis Factory Lands with Anuradha s Vision

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి శ్రమ వృథానే అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడేది చంద్రబాబు నాయుడు ఒక్కడే.. జగన్ కుట్రలకు పుల్ స్టాప్ పెట్టేది చంద్రబాబు నాయుడేనని జగన్ గుర్తుపెట్టుకోవాలి. కుప్పం నియోజకవర్గానికి హిందాల్కో పరిశ్రమ తీసుకొచ్చిన ఐటీ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+