Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్నూలు బస్సులో 20మంది సజీవదహనం ఘటన.. వారికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి!

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సమీపంలోని చిన్నటేకూరు వద్ద ఈ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకుని 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయిన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురయ్యింది. ఈ బస్సు ప్రమాద ఘటన పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

బస్సులో ప్రయాణికుల సజీవ దహనం ఘటనపై పవన్ కళ్యాణ్
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్ కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమై, ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో 20మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

Kurnool bus incident latest updates ap deputy cm Pawan Kalyan appeals to them

రవాణా శాఖ వారికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించడం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

బస్సు దగ్ధం ఘటనపై స్పందించిన హోం మంత్రి వంగలపూడి అనిత
మరోవైపు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కర్నూలు జిల్లా, చిన్నటేకూరు గ్రామం సమీపంలో జరిగిన దురదృష్టకరమైన బస్సు అగ్ని ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

స్పందించిన తెలంగాణా సీఎం.. కీలక ఆదేశం
బస్సులో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శి, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్‌ను సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్
కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరమని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+