వైఎస్ ఉన్నప్పుడే అనుమతులు.. చంద్రబాబుది అసత్య ప్రచారం: పోలవరంపై కేవీపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు అసత్య ప్రచారాలకు పూనుకున్నారని ఆరోపించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని కేవీపి గుర్తుచేశారు. గతంలో పోలవరంపై చంద్రబాబు ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు.
Recommended Video


ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేవీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకు వెళ్లి చంద్రబాబు 'స్టే' తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన ఇందిరను, పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. 2019నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని చెప్తున్న చంద్రబాబు.. రూ. 1800 కోట్లతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కేవీపీ ప్రశ్నించారు. 2014నాటి అంచనాలతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. పోలవరం నిర్మాణం కేంద్రం పర్యవేక్షణలో ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications