నేను నిజంగానే పిచ్చివాడినయ్యా: రాజ్యసభ చైర్మన్కు కేవీపీ ఘాటు లేఖ
అమరావతి: రాజ్యసభ వైస్ చైర్మన్ కురియన్ తనను పిచ్చివాడు అనడంపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు.
కురియన్ రాజ్యసభ సంప్రదాయాలు గౌరవించాలని హితవు పలికారు. తనను పిచ్చోడిగా సంభోధించినందుకు తాను బాధపడలేదని చెప్పారు. కానీ బడ్జెట్లో ఏపీకి జరిగి అన్యాయం చూసి నిజంగానే పిచ్చివాడిని అయ్యానని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే తాను వెల్లోకి వచ్చానని చెప్పారు. కేంద్రానికి కనువిప్పు కలిగే వరకు తాను రాజ్యసభలో ఇలాగే ప్రవర్తిస్తానని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications