న్యాయవాది అఘాయిత్యం: స్టింగ్ అపరేషన్తో బయటపెట్టిన మహిళ
విజయవాడ: ఓ యువతి ఆర్థికావసరాలను అవకాశాంగా చేసుకొని ఆమెపై ఓ న్యాయవాది దారుణానికి పాల్పడ్డాడు. ఆ న్యా యవాది వికృతచేష్టలను స్టింగ్ఆపరేషన్ ద్వారా ఆమె బయటపెట్టింది. ఆ తర్వాత బాధితురాలు విజయవాడ పోలీసు కమిషనర్ను ఆశ్రయించింది.
విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు న్యాయవాదిపై ఐపీసీ 448, 354 డి, 376 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న న్యాయవాది పారిపోయాడు. తల్లి మృతితో పూర్ణానందంపేటలో ఆ యువతి రేషన్ షాపును నిర్వహిస్తోంది. వ్యాపార నిమిత్తం యువతి రూ.3.80లక్షలు అప్పుగా తీసుకొంది.
అప్పుల వారి నుంచి ఒత్తిడితో న్యాయవాది పి.తాతారావు వద్ద రూ.4 లక్షలు అప్పు తీసుకొని పాత అప్పులు తీర్చింది. ఇంకావారికి కొం త మొత్తం ఇవ్వాల్సి వుంది. న్యాయవాది యువతి ఉండే రేకులషెడ్డును తనఖా పెట్టుకుని అప్పుఇచ్చాడు. మిగిలిన అప్పుకోసంఒత్తిడిపెరగగా రేకులషెడ్డు అమ్మాలని న్యాయ వాది తాతారావుకు చెప్పింది.
అప్పటినుంచి న్యాయవాది తాతారావు కోరిక తీర్చాలని అసభ్యంగా ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడు, బెదిరిస్తూ లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. గత నెల 27రాత్రి న్యాయవాది యువతి ఇంటికి వచ్చిఅత్యాచారయత్నానికి ఒడిగట్టగా ఆమె కేకలుపెట్టడంతో పారిపోయాడు.
అంతకుముందే మె పొరుగు మహిళలకు ఈ విషయం చెప్పడంతో వారు ఆమెకేకలువిని సెల్ఫోన్లోఈ కీచకుడి చేష్టలు చిత్రీకరించగా న్యాయవాది కీచకచేష్టలు బహిర్గతమయ్యాయి.