అమరావతి పర్యటనకు సింగపూర్ ప్రధాని 'నో'.. ఎందుకు?
విజయవాడ : ఎప్పుడూ సింగపూర్ నామస్మరణలో తరించిపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఓవైపు సింగపూర్ పీఎం ఇండియాలోనే పర్యటిస్తున్నా ఆయన్ను అమరావతికి ఎందుకు తీసుకురాలేకపోయారనేది ఇప్పుడు చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. రాజధాని గురించి ప్రస్తావించిన చాలా సందర్బాల్లో.. సింగపూర్ ప్రధానిని అమరావతికి ఆహ్వానించానని చంద్రబాబు చాలాసార్లు పేర్కొనడం ఈ ప్రశ్నను ఇప్పుడు ఇంతలా తెరమీద చర్చల్లో నానేలా చేసింది.

అసలు సింగపూర్ ప్రధాని ఇండియాలో అడుగుపెడితే చంద్రబాబు అమరావతికి ఆహ్వానించకుండా ఎలా ఉంటారు? ఆయన్ను అమరావతికి ఆహ్వానించారు గానీ స్విస్ ఛాలెంజ్ వ్యవహారం కాస్త ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో.. ఇలాంటి తరుణంలో.. అమరావతిలో అడుగుపెడితే సొంత దేశం కంపెనీల నుంచే విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందన్న ఉద్దేశంతో అమరావతి పర్యటనకు సెయిన్ లూంగ్ దూరంగా ఉండిపోయారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా.. ఆయన మాత్రం అమరావతిలో అడుగుపెట్టేందుకు ససేమిరా అన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఈ విషయమై టీడీపీ నేతలను ఎవరైనా ప్రశ్నిస్తే..? ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి వారిది. అయితే ఇప్పటికీ ఆశ వదులుకోని చంద్రబాబు మాత్రం ఇండియా టూర్ అయిపోయే లాగా సింగపూర్ ప్రధానిని ఎలాగైనా అమరావతికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో!
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications