ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం.. టెన్షన్లో స్టూడెంట్స్ !!
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందనే సమాచారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ క్యాంపస్లోని యూనియన్ బ్యాంక్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్ధులు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారింది.
సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు..
కాగా సంక్రాంతి పండుగ రోజున రాత్రి 12.50 గంటల నుంచి 1.05 గంటల మధ్య చిరుత యూనివర్సిటీ ప్రాంగణంలో సంచరించినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో అక్కడున్న ఒక కుక్కను నోట కరుచుకుని చిరుత తీసుకెళ్లిన దృశ్యాలు కూడా నమోదయ్యాయి. అలానే పాపులేషన్ స్టడీస్ భవనం సమీపంలో ఒక జింకను చిరుత వేటాడిన ఆనవాళ్లు కూడా లభించాయి. జింకను చంపి కొంత భాగం తిని, మిగిలిన కళేబరాన్ని అక్కడే వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన కూడా క్యాంపస్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైంది.

అటవీశాఖ అప్రమత్తం..
ఈ వరుస ఘటనలతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఈ సమాచారాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. చిరుత కదలికలను గమనించేందుకు క్యాంపస్ పరిసరాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో సిబ్బందిని బీట్ డ్యూటీకి కేటాయించారు. రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగవద్దని విద్యార్థులు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఈ మేరకు యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారి మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులు గుంపులుగా మాత్రమే కదలాలని, రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అయితే ప్రస్తుతం చిరుత క్యాంపస్ పరిసరాల్లోనే ఉందా? లేక అడవుల్లోకి వెళ్లిందా? అనే విషయంపై అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అప్రమత్తత అవసరమని అధికారులు స్పష్టం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications